అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన మంత్రవర్గ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి అని ప్రశ్నించారు. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంపై మరోసారి లేఖ రాయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా నీటి వినియోగంపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని జగన్ స్పష్టం చేశారు.