అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించారు. ఏపీకి చెందిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎంను, మంత్రి రోజాతో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్ విజయంలో శ్రీకాంత్, బధిరుల ఒలింపిక్ క్రీడల్లో కర్నూలుకు చెందిన జాప్రిన్ కాంస్య పతకం సాధించారు. ఈ ఇద్దరిని సీఎం సన్మానించారు. షేక్జాఫ్రిన్కు అర్హతను బట్టీ ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులకు సూచించారు.