అమరావతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఏపీ సీఎం జగన్ ఇవాళ భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 11న న మంత్రివర్గ పునర్వివ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా రేపు మంత్రివర్గంలోని కొంత మంది మంత్రుల రాజీనామాకు ఆమోదం విషయంపై, ఇటీవల జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు అంశాలపై గవర్నర్తో చర్చించే అవకాశముంది.
కాగా రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన జగన్ ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, నిధుల విడుదల, ఆర్వోబీ వంతెనలపై చర్చించారు. అనంతరం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం గవర్నరత్తో జగన్ భేటీ కానున్నారు.