అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ఈనెల 13న జరుగనున్న ఎన్నికల పోలింగ్ అనంతరం విదేశాలకు వెళ్లనున్నారు. ఈనెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ బుధవారం సీబీఐ కోర్టులో అనుమతి కోరారు. దేశాలకు అనుమతి కోరుతూ బెయిల్ షరతు సడలించాలని కోర్టును కోరారు. పలు కేసుల్లో ఉన్న జగన్ దేశం విడిచి వెళ్ల వద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది . ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్ వేయాలని కోర్టు ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది.