అమరావతి : ఇంధనశాఖ,డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్లపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ కల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ఫ్రంహోం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డెస్క్టాప్ టేబుల్స్,సిస్టంచెయిర్స్,ఫ్యాన్స్,ట్యూబ్ లైట్లు,ఐరన్ రాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై మరింత ధ్యాస పెట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.