అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలువనున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు రాజ్భవన్లో భేటీ కానున్నారు. మార్చి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున వీరిద్దరి మధ్య సమావేశం జరుగనుంది. అదే రోజు ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగం, 8న ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంతాపం తీర్మాణం, 11న మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెడుతారని ఏపీ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.