ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై లేనిపోని పుకార్లు లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేటలో గ్రామ, వార్డు వాలెంటీర్లకు జరిగిన సన్మాన సభలో జగన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని, కానీ… దీనిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ తనకు క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లేమైనా ప్రధాని మోదీ సోఫా కింద దూరి విన్నారా? లేదా తన సోఫా కిందనో దూరి విన్నారా? అంటూ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని చూస్తుంటే అసూయకు హద్దేముంది? అని అనిపిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఇంత అసూయతో జీవిస్తే.. గుండె పోటులు వచ్చి, తొందరగా టిక్కెట్ తీసుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ దొంగల ముఠాల వ్యవహరి స్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యనించారు. వీరిద్దరూ హైదరాబాద్లో మకాం వేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వారి దుర్మార్గపు ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు.