అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కు ఏపీ సీఐడీ (AP CID) రెడ్బుక్ (Red Book) అంశంపై నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులునోటీసులు జారీ చేసింది. రెడ్బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. లోకేష్కు నోటీసులు ఇవ్వడానికి గురువారం ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లిగా వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో కోర్టు సూచనల మేరకు శుక్రవారం ఆయనకు వాట్సప్లో పంపించారు. నోటీసులు అందుకున్నట్లు లోకేష్ ద్రువీకరించారు.
లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్బుక్లో రాశానని, వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పేర్కొనడాన్ని సీఐడీ అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.