అమరావతి : ఏపీ క్యాబినేట్ సమావేశం కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభమయ్యింది . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో 32 అంశాలపై చర్చించనున్నారు.
పీఆర్పీపై ఉద్యోగుల ఆందోళన, కరోనాపై కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలు, విత్తన, ఎరువుల సరఫరాకు ఈ విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చ, ఇంధన శాఖకు సంబంధించి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.