అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ సచివాలయంలో భేటీ అయ్యింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, సచివాలయంలో 83 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. కియా పరిశ్రమ రిజిస్ట్రేషన్లు ఫీజుల్లో మార్పులు చేసింది.
ఏపీలో కొత్తగా 4 శాశ్వత అదాలత్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ చారిటబుల్ ట్రస్టుకు ఆమోదం. అల్లూరి జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో నొవాటెల్ బ్రాండ్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్తపోస్టుల ఏర్పాటుకు, భావనపాడు పోర్టు విస్తరణకు ఆమోదం తెలిపింది.