BRS Party | ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల గన్నవరం ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. ఎయిర్పోర్టులోనే స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అక్కడ్నుంచి నేరుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఉండవల్లి గ్రామంలోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరీ దేవి సమేత భీమలింగేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ మహా మృత్యుంజయ జప(దోష) విశ్వశాంతి మహాయాగానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ఆ తర్వాత గుంటూరులో ఆయన బస చేయనున్నారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో తోట చంద్రశేఖర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. పార్టీలో చేరికలు, తాజా రాజకీయ పరిణామాలు సహా… పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం.