అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజు శుక్రవారం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. వీటిపై అసెంబ్లీలో మంత్రు లు, ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా సీఎం జగన్ రెండో రోజు రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై మాట్లాడారు.
రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు. శని, ఆదివారాలు సెలవు దినం సందర్భంగా సమావేశాలను సోమవారం తిరిగి ప్రారంభించనున్నారు.
శాసనసభలో ప్రవేశపెట్టిన ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, ల్యాండ్ టైటిలింగ్, యూనివర్సిటీల చట్ట సవరణ, పంచాయతీ రాజ్ సవరణ తదితర వాటికి సభ ఆమోదం తెలిపింది . మంత్రు లు బుగ్గన రాజేంధ్రనాథ్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, కొట్టు సత్యనారాయణ మాట్లాడారు.