అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సెలవుల అనంతరం ఈరోజు ప్రారంభమైన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ వెల్లోకి దూసుకువచ్చి నిరసనలు తెలియ జేయడంతో సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. పట్టువీడని దేశం సభ్యులు కాగితాలను చింపివేసి స్పీకర్పై పడవేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం అనేకమార్లు సభ్యులకు విజ్ఞప్తి చేసినా వారు వినకపోవడంతో ఏపీ సీఎం జగన్ సహచర మంత్రులతో సమావేశమై టీడీపీ సభ్యుల ప్రవర్తనపై చర్చించారు. అనంతరం మరోసారి స్పీకర్ విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఆల వీరాంజనేయ స్వామిని సస్పెన్షన్ చేస్తు నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు.