అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్రమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2.56,256 కోట్లు రెవెన్యూ వస్తుందని , వ్యయం రూ. 2,08,261 కోట్లు ఉంటుందని వెల్లడించారు. రెవెన్యూలోటు రూ 17, 036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు ఉంటుందని వివరించారు. సెకండరీ ఎడ్యుకేషన్కు రూ. 27, 706 కోట్లు , ఈడబ్ల్యూఎస్కు రూ. 10,201 కోట్లు సివిల్ సప్లైస్కు రూ. 3,719 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 58,583 కోట్లు ఉంటుందని వెల్లడించారు. జీఏఈడీకి రూ.998 కోట్లు , సచివాలయ వ్యవస్థకు రూ. 3,396 కోట్లు , వ్యవసాయానికి రూ. 11, 387 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1,568 కోట్లు అందజేస్తున్నామన్నారు.
బీసీ సంక్షేమానికి రూ. 20,962 కోట్లు, పర్యావరణం, అటవీ శాఖకు రూ. 685 కోట్లు , ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు , విద్యుత్కు రూ. 10,281 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.