అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తరువాత ఈసీ(Election Commission) వ్యవహారశైలీలో మార్పు వచ్చిందని ఆరోపించారు. ఈసీకి చంద్రబాబు (Chandra Babu) వైరస్ సోకిందని మండిపడ్డారు. ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
చంద్రబాబు, అతడి మనుషులు చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్, పోలీసులు పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి (MLA Pinnelli) వీడియో ఈసీకి తెలియకుండా ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.
ఏపీలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని ధీమాను వ్యక్తం చేస్తూనే, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తిరిగి పరిశీలిస్తామని పేర్కొన్నారు.