అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు నిర్వాహకులు సన్నహాలు చేస్తున్నారు.
తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్న నాయకులు ముందస్తుగా విజయవాడలో సమావేశమై చర్చించారు. ఏప్రిల్ 14న కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని వెల్లడించిన నాయకులు అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి శ్రావణ్కుమార్ నేతృత్వంలో అంబ్కేర్ జయంతి రోజున పూర్తి సమాచారంతో పార్టీని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై పోరును సలిపేందుకు పార్టీ ఉద్దేశమని వీటిని అరికట్టేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో పార్టీని నెలకొల్పుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
2024లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దళిత, బహుజనుల చేత పోటీ చేయిస్తామని నిన్న విజయవాడలో జరిగిన దళిత అసెంబ్లీ సమావేశంలో శ్రావణ్కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులతో పాటు మాల మహానాడు, మాల మహాసభ, ఎమ్మార్పీఎస్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పాల్గొనడం విశేషం.