అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ( Milk Adulteration ) ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న ఓ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామలక్ష్మి అనే 73 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
ఫిబ్రవరి 22 నుంచి రాజమహేంద్రవరం లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు వాంతులు,కడుపునొప్పి, మూత్రపిండాల వైఫలం్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండగా, ప్రస్తుతం మరి కొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.