అమరావతి : విశాఖ జిల్లా సబ్బవరం మండలం చినయాతపాలెం వద్ద బాణసంచా పేలుడు ఘటనలో చికిత్సపొందుతూ ఇవాళ మరొకరు మృతిచెందారు. ఈ ఘటనలో నిన్న విజయనగరం జిల్లా వంతరం గ్రామా నికి చెందిన మహేశ్(34) ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడ్డ గుంటూరు జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ (37) చికిత్సపొందుతూ కన్నుమూశాడు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వినాయకచవితి నిమజ్జనోత్సవాలు, రాబోయే దీపావళి నేపథ్యంలో సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ చినయాపాలెంశివారులో భారీగా బాణసంచా తయారు చేస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ముడి సరకు తెచ్చి నిల్వ ఉంచారు. నిన్న షెడ్లో ఒక్కసారిగా పేలుడు సంబవించడంతో ప్రమాదం జరిగిం ది. ఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి, ఎమ్మెల్యే అధీప్రాజ్ , డీఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు.