తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, గంధంతో తిరుమంజనం నిర్వహించి, సింధూరంతో విశేష అలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వెంకటయ్య, వీజీవో బాలిరెడ్డి, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.