తిరుపతి : తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Annual Brahmotsavam) భాగంగా మంగళవారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9. 30 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారని అర్చకులు వెల్లడించారు.
మే 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు(Teppostavam) మే 31 వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశామన్నారు.