తిరుపతి : తరిగొండ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) అధికారులు వివరించారు. మార్చి 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 21న రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణోత్సవం, 25న పుష్పయాగం 24న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.
తిరుమలలో 63,421 మంది దర్శనం
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 63,421 మంది భక్తులు దర్శించుకోగా 19,644 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.84 ఆదాయం(Income) వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.