తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల నేపథ్యంలో వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు,పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో సత్రేనాయక్ నాయక్, సూపరింటెండెంట్ భూపతి,టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.