తిరుపతి : చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా ఏప్రిల్ 9న సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 10 నుంచి 19వ తేదీ వరకు శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్ 10న శ్రీరామనవమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఉదయం 7 నుంచి 7.45 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారన్నారు. చంద్రగిరి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
2న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు వివరించారు. ఏప్రిల్ 14న సాయంత్రం శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. ఏప్రిల్ 16న ఉదయం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. భక్తులు రూ.750/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన వచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.