అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తలశీల రఘురాం (కృష్ణా), వరుదు కల్యాణి(విశాఖ), వంశీకృష్ణ యాదవ్ (విశాఖ), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు), అనంత ఉదయ భాస్కర్ (తూర్పు గోదావరి), ఇందుకూరు రఘురాజు(విజయనగరం), మూరుగుడు హన్మంత రావు(గుంటూరు), అరుణ్కుమార్(కృష్ణా), తూమూటి మాధవరావు(ప్రకాశం), కృష్ణ రాఘం జయేంద్ర భరత్ (చిత్తూరు), వై. శివరామిరెడ్డి (అనంతపురం) వైసీపీ అభ్యర్థులని ఆయన వెల్లడించారు.
మొత్తం 14 ఎమ్మెల్సీల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనార్టీలకు, మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించినట్లు సజ్జల పేర్కొన్నారు. పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని ప్రశంసించారు.