అమరావతి : తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్మికమాసం, వరుస సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ నిలబడడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో చిన్నపిల్లలతో తల్లులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. రాజగోపురం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది.
అయితే రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించక పోవడంతో ఆలయం భద్రతా సిబ్బందిపై భక్తులు తిరగబడ్డారు. శనివారం ఆలయంలో వ్రతాలు, సర్వదర్శనాలకు వేలాధి సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి.వ్రతాలు, పూజలు, దర్శనాలు, నిత్యకల్యాణం, ప్రసాద విక్రయాల ద్వారా ఒక్కరోజే రూ. 93.96లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.