తిరుపతి : తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ట్రస్టుల(Trust) కు భక్తులు విరాళాలను (Donations) అందజేశారు. శనివారం ముంబాయికి చెందిన కమల్ ఝుంఝున్వాలా, బాల సుదర్శన్ రెడ్డి బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో ప్రత్యేకాధికారి డాక్టర్ రెడప్పరెడ్డికి దాతలకు చెక్కును అందచేశారు. టీటీడీ(TTD) అన్నప్రసాదం ట్రస్ట్ కు ఎస్ .ఆర్ .ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తిరుపతికి చెందిన ప్రొపెసర్ నారాయణరావు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని ఈవో నివాసంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి డీడీని అందజేశారు.