అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత ఆ రాష్ట్ర మంత్రివర్గం రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనుంది. ప్రైవేటు యూనివర్సిటీల నియంత్రణ, విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీపైనా ఇందులో చర్చించనున్నారు. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు, ఇటీవల జారీ చేసిన ఉద్యోగ నియామక క్యాలెండర్తోపాటు పొరుగు రాష్ట్రాలతో ఉన్న జల వివాద అంశాలు సైతం సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.