అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో రాత్రి 11 గంటల నుంచి మరుసరిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.