అమరావతి : కరోనా మహమ్మారికి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పోలీసులు బలవుతున్నారు. గురువారం ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీ రాం ప్రసాద్ కరోనా మృతి చెందారు.
ఎస్పీ రాంప్రసాద్కు గత పది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ ఆయన కన్నుమూశారు.
పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా రాంప్రసాద్కు మంచి పేరు ఉంది. గతంలో విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీగానూ ఆయన విధులు నిర్వర్తించారు.
ప్రస్తుతం కృష్ణ జిల్లా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్-కేడర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కేడర్కు ఆయనను కేటాయించారు. రాంప్రసాద్ మృతికి పలువురు పోలీసులు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.