అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు. నిబంధన ప్రకారం ప్రైవేట్ దవాఖానలకు 25 శాతం వ్యాక్సిన్లు కేటాయించారు. జులైలో 17.71 లక్షల డోసులు ఇచ్చారని ఇవి పూర్తిగా వినియోగానికి నోచుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. టీకా డోసులను ప్రభుత్వం సేకరించి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. కేబినెట్ సెక్రటరీ భేటీలో పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయని ఆయన గుర్తు చేశారు. డోసుల సరఫరాపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.