అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని బోర్టు స్పష్టం చేసింది.