YSRCP: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జయరాం వెల్లడించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని, అందుకే ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు.
‘కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ నన్ను అడిగారు. నాకు అది ఇష్టం లేదు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి అనే ఇద్దరు పూజారులున్నారు. దాంతో జగన్ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారు. వాళ్లు చెప్పిందే ఆయన చేస్తున్నారు.