అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 58 మంది చనిపోయారు. కాగా 12,492 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 85,637. మొత్తం మరణాలు 11,940గా ఉంది.
జిల్లాల వారీగా తాజా కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మృతిచెందగా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళంలో ఆరుగురు, అనంతపురం, విశాఖపట్నంలో నలుగురు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున మృతిచెందారు.