అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,995 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. మరో 397 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 22,870 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
అత్యధికంగా విశాఖపట్టణంలో 1103 కేసులు, చిత్తూరులో 1039, నెల్లూరులో 397, కడపలో 377, గుంటూరులో 326, కర్నూల్లో 323, ఈస్ట్ గోదావరిలో 303, శ్రీకాకుళంలో 243, అనంతపూర్లో 212, కృష్ణాలో 203 కేసులు నమోదు అయ్యాయి.