(Corona at AP) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. చాలా రోజుల తర్వాత ఈ కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. అత్యధికంగా చిత్తూరులో 96 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే విశాఖ జిల్లాలో 89, కృష్ణాలో 66, గుంటూరులో 49 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఇదే సమయంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 128 మంది డిశ్చార్జీ కాగా, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,78,923 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20,62,157 మంది కోలుకున్నారు. ఇంకా 2,266 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,500కి చేరింది.