అమరావతి: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకేసారి 70 మంది డీఎస్సీలు, ఏడుగురు ఐపీఎస్లను (IPS) ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఒకే చోట మూడేండ్లు పదవీకాలం పూర్తిచేసుకున్న డీఎస్పీలను బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ చైతన్య కూడా ఉన్నారు.