Kodali Nani | ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు కనీసం ఫోన్ చేయలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారని నాని క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్తో సమావేశమైన నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పట్టించుకునేంత టైం తమకు లేదన్న ఆయన.. రేవంత్కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమని అన్నారు. అయినా రేవంత్కు ఎందుకు ఫోన్ చేయాలి.. ? ఎందుకు కలవాలి ? అంటూ ఎదురు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తుంటి ఎముక విరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్ పరామర్శించారని.. రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి ఎముక విరిగిందా వెళ్లి కలవడానికి అంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్ తీసుకున్నట్లు వస్తున్న రూమర్స్పైనా నాని స్పందించారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తామని.. అప్పుడు ఆయనే తమకు అపాయింట్మెంట్ ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ” ఆయనది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ . రేవంత్ రెడ్డి అక్కడ సుప్రీమా. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమన్నది” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లు తీసేస్తే ఆయనకు పదవి ఉండదంటూ తనదైన శైలిలో చెప్పారు.
ఏపీలో చంద్రబాబును గెలిపించాలని హైకమాండ్ ఆదేశిస్తే రేవంత్రెడ్డి చచ్చినట్లు ఆ పని చేయాల్సిందేనని కొడాలి నాని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులాగా సీఎం జగన్ ఎదరు చూడరని అన్నారు. ఇక ఏపీలో షర్మిలకు రేవంత్ సపోర్ట్ ఇవ్వడం కాదు.. ఏపీలో కూడా పీసీసీ అధ్యక్షుడు అయి ప్రచారం చేసుకోవచ్చని అన్నారు.
రేవంత్ రెడ్డిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!.. వీడియో#KodaliNani #YSRCP #AndhraPradesh #CMRevanthReddy #Congress #Telangana #NTVTelugu pic.twitter.com/zwJMAPyXN7
— NTV Telugu (@NtvTeluguLive) January 8, 2024