చిక్కడపల్లి, జూన్ 26: టీకా అందరికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం గాంధీనగర్ డివిజన్లోని సురభి పార్కులో వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీకా ప్రక్రియను వేగవంతం చేశామని అన్నారు. ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అర్హులందరూ టీకా తీసుకుని కరోనా అంతంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీకాంత్, రాకేశ్కుమార్, మారిశెట్టి నర్సింగ్రావు, వెంకటేశ్, జాహంగీర్, సంతోష్ , వల్లాల శ్యామ్యాదవ్, సుధాకర్, రాజేశ్, విజయ్, పున్న సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉజ్వల భవిషత్ కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా శివసింహ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లో ఆంధ్రా కేఫ్ వద్ద అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.
ముషీరాబాద్: కవాడిగూడ డివిజన్ సూరజ్నగర్, ఎల్సీగూడ, కోదండరెడ్డినగర్లో రూ.9లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ శనివారం కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక బస్తీవాసుల ఇబ్బందుల దృష్ట్యా రోడ్డు ఫ్లోరింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్డు నిర్మాణాలతో పాటు అంతర్గత రోడ్డు నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, రాంచందర్, వల్లాల శ్యామ్ యాదవ్, రఫీ, జమాలుద్ద్దీన్, వేణు, రాజేశ్, హరి, రవియాదవ్, శివ, రాజశేఖర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భోలక్పూర్లో టీకా పంపిణీ చేయడానికి గాను మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్టీ నాయకులు ముఠా జయసింహ, మహ్మద్ అలీ, వై.శ్రీనివాస్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.