అమరావతి: ఈ నెల 8న జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్తోపాటు ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు, లాన్స్ నాయక్ బీ సాయితేజ ( Lance Naik B Sai Teja ) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 8న జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆర్మీ హెలిక్యాప్టర్లో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో హెలిక్యాప్టర్లోని 14 మందికిగాను బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు తీవ్రంగా కాలినగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.