అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు దాడులు విస్తృతం చేస్తున్నారు. వారంరోజుల్లో నలుగురు అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆడిట్ కార్యాలయంపై ఇవాళ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీనియర్ ఆడిటర్ శ్యామ్ప్రసాదరావు రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. జిల్లాలోని ఒక వీఆర్వో రిటైర్డు అనంతరం చనిపోయాడు. అతడి రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం బాధితుడు సీనియర్ ఆడిట్ అధికారి శ్యామ్ ప్రసాదరావును సంప్రదించగా రూ. 10వేల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు కార్యాలయంపై దాడి చేసి లంచం తీసుకుంటున్న అధికారిని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.