అమరావతి : అమరావతి రాజధాని కేసుల విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 15(సోమవారం)నుంచి ప్రారంభించనున్నది. ఇందుకోసం త్రిసభ్య ధర్మాసనం కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సభ్యులుగా విచారణ చేపట్టనున్నారు. మొత్తం 57 కేసులను హైబ్రిడ్ విధానంలో కేసులను విచారించనున్నారు.