అమరావతి : అంబేద్కర్ (Ambedkar) పై కేంద్ర మంత్రి అమిత్ షా (Minister Amit Shah) వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని ట్విటర్లో ( Twitter ) పేర్కొన్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనని అన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమేనని వ్యాఖ్యనించారు. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందని, రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తోందని మండిపడ్డారు.
రాజ్యాంగం మీద, జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందని విమర్శించారు. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని, మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా @AmitShah చేసిన వ్యాఖ్యలు బీజేపీ @BJP4India అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని…
— YS Sharmila (@realyssharmila) December 19, 2024