హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోని తాజ్ హోటల్లో బసచేస్తారు. ఆందివారం ఉదయం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో జరుగుతున్న స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ (Southern council meeting) సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి దర్శించుకుంటారు. అటునుంచి ఢిల్లీకి తిరుగుపయణమవుతారు.