అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) నియామకంపై ఏపీ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) సెటైర్లు వేశారు. ఆమె పీసీసీ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏపీలో జీరోనని వ్యాఖ్యనించారు. ఏపీలో అసలు కాంగ్రెస్ (Congress ) అంటూ లేదని, లేని పార్టీకి చీఫ్ ఎవరైతే తమ కెందుకని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ను విడగొట్టి ఏపీకి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరని అన్నారు. గల ఎన్నికల్లో ఆ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువవగా పోలయ్యాయని గుర్తు చేశారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నా చెల్లెళ్లు రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపై ఆయన స్పందిస్తూ రాజకీయాల్లో అన్నదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు వేర్వేరూ పార్టీలో ఉండడం సహజమని అన్నారు. అయితే అందరూ ప్రధానులు కాలేరు, రాష్ట్రపతులు కాలేరని వ్యాఖ్యనించారు.