అమరావతి : ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్మెన్లను క్రమబద్ధీకరించాలని(Regularize )గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ ధాఖలు చేశారు.
దీంతో గురువారం విచారించిన కోర్టు ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటు, మరో ముగ్గురికి నెలరోజుల జైలు(Jail) శిక్ష విధిస్తూ వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈనెల 16 లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.