అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్లు జారీ చేసింది. వీటికి స్థానిక ప్రభుత్వాల మ్యాపింగ్కు ప్రత్యేకంగా ఎల్జీడీ కోడ్లను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నీ కోడ్ ద్వారానే అమలు అవుతాయని కేంద్రం వెల్లడించింది. ఈనెల 4 నుంచి ఏపీలో మరో 13 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పాలనను ప్రారంభించిన విషయం తెలిసిందే.
మన్యం జిల్లాకు 743, అనకాపల్లి జిల్లాకు 744, అల్లూరి జిల్లాకు 745, కాకినాడ జిల్లాకు 746, కోనసీమ జిల్లాకు 747, ఏలూరు జిల్లాకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్ల జిల్లాకు 750 కోడ్ నంబర్లను కేటాయించింది. తిరుపతి జిల్లాకు 752, అన్నమయ్య జిల్లాకు 753, సత్యసాయి జిల్లాకు 754, నంద్యాల జిల్లాకు 755 నంబర్ల కోడ్ను కేటాయించింది.