అమరావతి : ఏపీలో కూటమి నాయకులు రాష్ట్ర గవర్నర్( Governor ) అబ్దుల్ నజీర్ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభా నేతగా చంద్రబాబు(Chandra Babu) ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మాణ లేఖను అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ టీడీపీ (TDP) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేనా నాయకుడు నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులను గవర్నర్ ఆహ్వానించారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు చేయనున్న ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని చిరంజీవికి చంద్రబాబు ఆహ్వానం
బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆహ్వానించారు.