తిరుమల : కరోనా కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో నిలిపివేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఆగస్టు 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జానపద కళలు అంతరించిపోకుండా అఖండ హరినామ సంకీర్తన ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భజన బృందాలకు వసతి, భోజనం, దర్శనం కల్పిస్తామని వివరించారు.