తిరుపతి : తిరుపతి(Tirupati) లోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారిని, సేనాధిపతిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 20న చిన్నశాత్తుమొర, 26న ప్రణయ కలహోత్సవం, 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వెల్లడించారు.