అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం నడుస్తోందని, రాష్ట్రం దోపడి వ్యవస్థలా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధరీశ్వరి అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చారో జగన్ను ప్రశ్నించాలని కార్యకర్తలకు,ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా ప్రయోజనం ఏమిటని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో నిర్వహించిన బీజేపీ ప్రజాపోరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎస్ జగన్ మూడేండ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రివర్స్ టెండర్ చేస్తానని, రాష్ట్రానికి డబ్బులు ఆదాచేస్తానని చెప్పి రాష్ట్ర అప్పును ఎనిమిది లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. ప్రభుత్వ అవలంభిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదన్నారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపులో లేకుండా పోయిందని విమర్శించారు.